Jio Post Paid Plans | టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం జియోప్లస్ స్కీం తీసుకొచ్చింది. ఈ స్కీం కింద న్యూ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అమల్లోకి తేనున్నది. వన్ పోస్ట్ పెయిడ్ ప్లాన కింద నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ప్లస్ స్కీం కింద రెండు వ్యక్తిగత పోస్ట్ పెయిడ్ ప్లాన్లు, రెండు ఫ్యామిలీ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్లతోపాటు ఒక నెల ప్రీ ట్రయల్ చాన్స్ లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జియో వెల్లడించింది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యుల్లో ఒకరికి నెల రోజుల ప్రీ ట్రయల్ ఆప్షన్ కూడా కల్పించింది.
రూ.399 జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్లు, 75జీబీ డేటా పొందొచ్చు. ఈ ఫ్యామిలీ ప్లాన కింద ముగ్గురు కుటుంబ సభ్యులను జత చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ పొందడానికి రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
జియో రూ.699తో తీసుకొచ్చిన మరో ప్లాన్లో 100 జీబీ డేటా లభిస్తుంది. ఇందులోనూ అపరిమితమైన కాల్స్, ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ కింద కూడా ముగ్గురు కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చు. ఈ ప్లాన్ కింద నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఓటీటీ సర్వీసులు ఫ్రీగా పొందవచ్చు. ఈ ప్యాక్ పొందడానికి రూ.875 సెక్యూరిటీ డిపాజిట్ అదనంగా పే చేయాలి. ఈ ప్లాన్ కింద జత చేసే ఒక్కో నంబర్పై అదనంగా రూ.99 పే చేయాలి. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి ఈ ప్లాన్ తీసుకుని వై, జడ్ అనే వ్యక్తులను జత కలుపుకుంటే వై, జడ్ వ్యక్తులకు రూ.99 చొప్పున పే చేయాలి.
ఇక జియో వ్యక్తిగత పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.299 నుంచి మొదలవుతుంది. ఈ ప్లాన్ కింద 30జీబీ డేటా పొందొచ్చు. ఇందులో అపరిమితమైన కాల్స్, ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన కింద రూ.375 డిపాజిట్ పే చేయాలి. ఇందులో ప్రీ ట్రయల్ ఫెసిలిటీ లేదు. జియోలో లభిస్తున్న మరో పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.599. ఇందులోనూ అపరిమితమైన కాల్స్, అన్లిమిటెడ్ డేటా, అపరిమితమైన ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ల కింద రూ.750 సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. జియో ఫైబర్, కార్పొరేట్ సిబ్బంది, క్రెడిట్ కార్డు ఖాతాదారులు, మంచి సిబిల్ స్కోర్ కల వారికి సెక్యూరిటీ డిపాజిట్ రాయితీ కల్పిస్తున్నది.
జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ కావాల్సిన యూజర్లు 70000 70000 ఫోన్ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. పోస్ట్ పెయిడ్ సిమ్ హోం డెలివరీ ఫెసిలిటీ కూడా జియో అందుబాటులోకి తెచ్చింది. హోం డెలివరీ టైంలో కుటుంబ సభ్యుల సిమ్ కార్డులు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకసారి మెయిన్ సిమ్ యాక్టివేట్ అయితే, మిగతా మూడు సిమ్లు లింక్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు జియో ప్రీపెయిడ్ యూజరయితే సిమ్ కార్డు మార్చుకోకుండానే పోస్ట్ పెయిడ్ ప్లాన్కు మార్చుకోవచ్చు. అందుకోసం మీరు మై జియో యాప్లోకి వెళ్లి ‘ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్’ ఆప్షన్కు మారాలి. అటుపై ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి, ప్రీ ట్రయల్ ఆప్షన్ ఎంచుకోవాలి. తదుపరి పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద చేరడానికి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని కోరుతుంది. అలా సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తే పోస్ట్ పెయిడ్ ప్లాన్కి మారినట్లే.