న్యూఢిల్లీ : లేటెస్ట్ త్రీ- రో ఎస్యూవీ జీప్ మెరిడియన్ లాంఛ్ అయింది. ఈ వాహనానికి ఇప్పటికే 5 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి.న్యూ జీప్ మెరిడియన్ రూ 29.90 లక్షల నుంచి రూ 36.95 లక్షల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇవి కేవలం ప్రారంభ ధరలేనని మరికొన్ని వారాల్లో ధరలు పెరుగుతాయని కంపెనీ పేర్కంది.
కంపాస్ ప్లాట్ఫాంపైనే జీప్ మెరిడియన్ను డెవలప్ చేయగా న్యూ మెరిడియన్ లాంగర్ వీల్ బేస్తో పొడవైన, భారీ విడ్త్తో స్టైలిష్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మూడో వరసతో సెవెన్ సీటర్గా మెరిడియన్ ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు కలిగిఉంది. కంపాస్ డిజైన్ను పోలిఉన్నా న్యూ మెరిడియన్ సరికొత్త లుక్తో ఆకట్టుకుంటుంది.