ముంబై : మహారాష్ట్రలోని పుణేకు సమీపంలోని రంజన్గావ్ ప్లాంట్లో జీప్ మెరిడియన్ స్ధానిక తయారీ ప్రారంభం కాగా న్యూ వెహికల్ బుకింగ్స్ను కంపెనీ ఓపెన్ చేసింది. లాంచ్ డేట్ ఇంకా ఖరారు కాకపోయినా రూ 50,000 టోకెన్ అమౌంటతో మెరిడియన్ ఎస్యూవీ బుకింగ్స్కు జీప్ అనుమతించింది. డీలర్లతో పాటు ఆన్లైన్లోనూ బుకింగ్స్ను షురూ చేసింది.
కంపాస్ డిజైన్ను పోలిఉండే జీప్ మెరిడియన్ స్టైలింగ్ పరంగా కంపాస్, లార్జర్ గ్రాండ్ చెరోకీని గుర్తు చేస్తుంది. లాంగర్ వీల్బేస్తో పాటు అదనపు సీట్లకోసం మరో రో సిద్ధం చేయంతో సెవెన్ సీటర్గా మెరిడియన్ కస్టమర్ల ముందుకు రానుంది. ఇక మే ద్వితీయార్ధంలో మెరిడియన్ టెస్ట డ్రైవ్లు అందుబాటులోకి రానుండగా జూన్లో ఎస్యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి.
జీప్ మెరిడియన్ తయారీ ప్రారంభమైన సందర్భంగా 2021 నుంచి భారతలో తయారవుతున్న మూడవ న్యూ మోడల్ జీప్ మెరిడియన్ అని స్టెలాంటిస్ ఇండియా సీఈఓ, ఎండీ రొలాండ్ బుచరా పేర్కొన్నారు. భారత రోడ్లకు అనుగుణంగా జీప్ మెరిడియన్ను ప్రత్యేకంగా డిజైన్, ఇంజనీరింగ్ చేపట్టామని చెప్పారు.