Jeep Compass | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ (Jeep) తన కంపాస్ ఎస్యూవీ, కొత్త మోడల్ ఎస్యూవీ.. మూడు వరుసల మెరిడియన్, కంపాస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కార్లు ఆవిష్కరించింది. కంపాస్ ఎస్యూవీ కారు 4×2 వేరియంట్ బ్లాక్ షార్క్ ఎడిషన్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో అందుబాటులో ఉంటుంది.
న్యూ కంపాస్ ధర రూ.20.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ హై ఎండ్ మోడల్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.23.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుంది. పాత మోడల్ కారుతో పోలిస్తే ప్రస్తుత ఎంట్రీ లెవల్ కంపాస్ ధర దాదాపు రూ.లక్ష తగ్గుతుంది.
న్యూ జీప్ కంపాస్ 2డబ్ల్యూడీ రెడ్ బ్లాక్ ఎడిషన్ కారు 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ విత్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 168 బీహెచ్పీ విద్యుత్, 350 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కొత్త కంపాస్ లీటర్ డీజిల్ పై 16.2 కి.మీ మైలేజీ ఇస్తుంది. 9.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది.
లోయర్ వర్షన్ కంపాస్ ఎస్యూవీలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ కూడా మార్కెట్లోకి తెచ్చింది జీప్. పాత మోడల్ కారుతో పోలిస్తే 20 శాతం ధర తక్కువ. ఎంట్రీ లెవల్ వేరియంట్ కార్ల ధరలు దాదాపు రూ.6 లక్షలు తగ్గుతాయి. ఇదిలా ఉంటే, భారత్ మార్కెట్లో జీప్.. ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కంపాస్ వేరియంట్ ఆఫర్ చేయడం లేదు.
న్యూ ఓవరాల్ ఎడిషన్ మూడు వరుసల మెరిడియన్ ఎస్యూవీ కారును జీప్ ఆవిష్కరించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెండు స్పెషల్ ఎడిషన్ కార్లు మెరిడియన్ అప్ లాండ్, మెరిడియన్ ఎక్స్ మోడల్ కార్ల సరసన మూడు వరుసల మెరిడియన్ ఎస్యూవీ చేరింది. మెరిడియన్ ఓవరాల్ ఎడిషన్ కారు పలు కాస్మొటిక్ అప్డేట్స్తో వస్తున్నది. న్యూ గ్రిల్లె విత్ క్రోమ్ సరౌండ్స్, రీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.