బెంగళూరు, సెప్టెంబర్ 5: ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ జావా.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను తీసుకొచ్చింది. ఆల్ స్టార్స్ 42 బోబర్ పేరుతో విడుదల చేసిన ఈ స్పోర్ట్స్ బైకు ప్రారంభ ధర రూ.2,08, 942కాగా, గరిష్ఠ ధర రూ.2,19,942గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ బైకును మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించారు. దేశీయంగా ఆల్ స్టార్స్ బైకులను పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా బైకును తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 334 సీసీ ఇంజిన్, 29.9 పీఎస్ల శక్తి, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.