న్యూఢిల్లీ, మే 15: చిన్న, మధ్యస్థాయి పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఐటీ రిటర్నులు దాఖలు చేసే టీఆర్-1, ఐటీఆర్-4లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ. ఈ ఫైలింగ్ పోర్టల్లో 2026-27 మదింపు సంవత్సరానికిగాను ఆర్జించిన ఆదాయానికి సంబంధించి ఈఫారాల ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చును.
వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. ఆడిట్ అవసరం లేని ఐటీఆర్-4 దాఖలు చేసే ట్యాక్స్ ప్లేయర్లకు ఆగస్టు 31 లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయడానికి ఆన్లైన్లో సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేతనాలు పొందేవారికి జూన్లో ఫారం-16 అందే అవకాశం ఉంటుంది.