న్యూఢిల్లీ, మే 18: దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,225.02 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,259.68 కోట్లతో పోలిస్తే 22.66 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.17,754.02 కోట్ల నుంచి రూ.19,058.29 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు రూ.12,632.29 కోట్ల నుంచి రూ.12,907.84 కోట్లకు పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.76,518.21 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.19,427.68 కోట్ల నికర లాభాన్ని గడించింది.