Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ టవర్స్ అంటే టక్కున గుర్చుకొచ్చేది సైబర్ టవర్స్. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది రహేజా మైండ్స్పేస్ ఐటీ సెజ్. సుమారు 108 ఎకరాల్లో విస్తరించివున్న ఈ సెజ్లో వందలాది ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఐటీ బూమ్ ప్రారంభమైన 1998లో ఈ సెజ్లో బహుళ స్థాయి భవంతుల నిర్మాణాలు చేపట్టింది. అప్పట్లో భవనాల ఎత్తు 10 అంతస్థులు కావడంతో ఈ లోపే నిర్మించారు. ఐటీ రంగం అంచనాలకుమించి దూసుకుపోతుండటంతో మాదాపూర్ నుంచి కోకాపేట దాకా విస్తరించింది.
ఐటీ కార్యాలయాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో పాత భవనాలను కూల్చివేసి..వీటి స్థానంలో కొత్తగా అధునాత నిర్మాణ శైలితో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆఫీస్ స్పేస్ను అందుబాటులోకి తీసుకోస్తున్నాయి. ఇదే క్రమంలో రహేజా మైండ్స్పేస్ ఐటీ సెజ్లో ఏడు అంతస్థులు కలిగిన రెండు భవనాలను శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో కూల్చివేశారు.
అత్యంత భద్రతా చర్యల మధ్య దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిష్ సంస్థతో కలిసి ఏడీఎఫ్సీ ఇంజినీరింగ్ సంస్థలు కేవలం 6 నుంచి 8 సెకండ్లలోనే ఈ భవంతులను కూల్చివేశారు. వీటి స్థానంలోనే కొత్తగా 23 అంతస్థులతో కూడిన రెండు భారీ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి, ఐటీ కార్యాలయాల కోసం అద్దెకు ఇవ్వనున్నది. పాత వాటి స్థానంలో కొత్త భవంతుల నిర్మించడటం ఇటీవల కాలంలో ఓ ట్రెండ్గా మారింది.
ఆఫీస్ స్పేస్కు డిమాండ్..
హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఇక్కడ తమ రెండో కార్యాలయాలను ప్రారంభిస్తుండటంతో ఆఫీస్ స్థలాన్ని ఎగరేసుకొని పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ రంగం టాప్గేర్లో దూసుకుపోతున్నది. తెలంగాణ రాకముందు రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరంనాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కావడంతో దేశంలోని అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి ఐటీ రంగంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
రహేజా మైండ్ స్పేస్ ప్రస్థానం..