IT Returns | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: చారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంఘాలకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ.. ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువును పెంచింది. నవంబర్ 30దాకా అవకాశమిచ్చింది. అలాగే 2023-24 మదింపు సంవత్సరం కోసం ఫామ్ ఐటీఆర్-7లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తెలియపర్చుటకున్న ఆఖరు తేదీని, కంపెనీల ఐటీఆర్ ఫైలింగ్కున్న గడువును నవంబర్ 30కి పొడిగించారు. ఇక 2022-23కుగాను ఫండ్స్, ట్రస్టులు, ఇన్స్టిట్యూషన్ల కోసం ఫామ్ 10బీ/10బీబీల్లో ఆడిట్ రిపోర్టుల సమర్పణకున్న గడువునూ అక్టోబర్ 31 వరకు పెంచారు.
ఇదిలావుంటే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 23. 51 శాతం పెరిగి ఈ ఏప్రిల్ మొదలు ఈ నెల 15 నాటికి రూ.8.65 లక్షల కోట్లకు చేరాయి. ఈ మేరకు కేంద్రం తెలియజేసింది. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం రూ.18.23 లక్షల కోట్లు వసూలవుతాయని బడ్జెట్లో అంచనా వేసింది కేంద్రం.