న్యూఢిల్లీ, జూలై 8: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) నూతన డైరెక్టర్లలో ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాజీవ్ మెహ్రిషీ కూడా ఉన్నారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) శనివారం ప్రకటించింది.
బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ నుంచి రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్)ను విడదీసి (డీమెర్జర్) దానికి జేఎఫ్ఎస్ఎల్గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కొత్త కంపెనీకి ఎండీ, సీఈవోగా హితేశ్ కుమార్ సేథీ వ్యవహరిస్తారని ఇప్పటికే పేర్కొన్న ఆర్ఐఎల్.. ఇప్పుడు ఎంపికైన డైరెక్టర్ల పేర్లను వెల్లడించింది. కాగా, ఈ నెల 1 నుంచే డీమెర్జర్ అమల్లోకి వస్తుందన్న రిలయన్స్.. 20ని కొత్త కంపెనీ షేర్ల కేటాయింపు కోసం రికార్డ్ డేగా ప్రకటించింది.