సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.. ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన టైం కోసం వేచి చూస్తున్నారా.. అయితే, ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి గతేడాది మార్చి నుంచి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. ఒకరకంగా చెప్పాలంటే దశాబ్ధ క్రితం స్థాయికి రుణాల వడ్డీరేట్లు పడిపోయాయి.
ఇప్పటికే తక్కువ వడ్డీరేట్ అమల్లో ఉండగానే.. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను.. సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారికి ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లను మరింత తగ్గించాయి. మహిళలైతే మరింతగా వడ్డీరేట్లు తగ్గించాయి. ప్రాసెసింగ్ ఫీజు.. ఇతర చార్జీలు మాఫీ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇండ్లు కొనుగోలు చేసేవారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నాయి.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఇండ్ల రుణాలపై వడ్డీరేటును మరింత తగ్గించింది. ఆల్టైం కనిష్ఠ స్థాయిలో 6.4 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్పెషల్ ఆఫర్లపై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి.
కరోనా వేళ ఆస్తుల ధరలు.. ఇండ్లు.. అపార్ట్మెంట్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది సరైన టైం అని రియాల్టీ నిపుణులు, ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ తాజా సర్వే ప్రకారం గత ఏడాది కాలంలో ఇండ్ల సేల్స్లో 67 శాతం పురోగతి నమోదైంది. కానీ ఇండ్లు.. అపార్ట్మెంట్ల ధరల్లో పెద్దగా తేడాల్లేవని నైట్ఫ్రాంక్ అభిప్రాయ పడుతోంది. సరసమైన ధరల వాతావరణం, అనుకూల ఆర్థిక పరిస్థితులతోపాటు డిస్పోజబుల్ ఇన్కంతో సెకండ్ హోం కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
ఇక 50 శాతానికి లోపే ఆదాయం మాత్రమే ఇంటికి తీసుకెళ్లే వేతన జీవులకు ఇప్పుడు సానుకూల అంశాలు ఉన్నాయి. ఇంటి రుణం అంటే సుదీర్ఘకాలం ఫైనాన్సియల్ కమిట్మెంట్తో కూడుకున్నది. అయితే ఇంటి రుణం తీసుకోవడానికి ముందుకొచ్చే ఫ్యామిలీలు తమకు వచ్చే నిధులు, ఆదాయ వనరులను అంచనా వేయడం చాలా కీలకం.
చెల్లింపులకు ఇబ్బందులు ఉంటే దీర్ఘకాలిక రుణం తీసుకునేందుకు అవకాశాల్లేవు. మీరు ఇంటి రుణం తీసుకోవాలనుకుంటే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణ వ్యయం పెరుగుతుంది. రుణం తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలు, ప్రీపేమెంట్ నిబంధన తదితర అంశాలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ అంశాలన్నీ చెక్ చేసుకుంటే ఇంటి రుణానికి ఎంత భారం పడుతుందీ, రీ పేమెంట్ ఎంత అన్న విషయమై స్పష్టత వస్తుంది. మున్ముందు ఇండ్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నందున సెకండ్ హోం కొనుగోలు చేయాలనుకుంటే ఇది కరక్ట్ టైం అని అంటున్నారు.
కేవలం ఆదాయం కోసమే అదనపు ప్రాపర్టీ కొనుగోలు చేయాలని ఆకాంక్షించేవారు కమర్షియల్ ప్లాట్లు, ఇండ్ల కొనుగోలుకు మొగ్గు చూపడం మంచిదన్న అభిప్రాయాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ ఆస్తుల నుంచి అద్దె రూపంలో 3-4 శాతం వడ్డీ వస్తే కమర్షియల్ భవనాలపై అద్దె రూపేణా 8-10 శాతం ఆదాయం లభిస్తుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టాలంటే విశ్వసనీయతతోపాటు సంక్లిష్ఠ సాంకేతిక సమస్యలు ఇమిడి ఉన్నాయి. అయినప్పటికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ పెరిగితే పరిస్థితిలో మార్పు వస్తుందంటున్నారు నిపుణులు.
విశ్వమారి వల్ల ఇప్పుడు ఇండ్ల కొనుగోళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ గిరాకీ వల్ల డెవలపర్లకు ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో త్వరలో ఇండ్ల ధరలు పెరిగిపోయే చాన్స్ ఉంటుందంటున్నారు అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్. ఖర్చులు పెరిగిపోయినా ప్రస్తుత పండుగ సీజన్లో, ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లతో గిరాకీకి అనుగుణంగా తక్కువ ధరలకే డెవలపర్లు అందించగలరంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా