IRCTC-Swiggy | మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. సకాలంలో భోజనం చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ల్లో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు మనకు ఇష్టమైన, నచ్చిన ఆహారం అందుబాటులోకి వస్తుంది. అందుకోసం ‘స్విగ్గీ’, ఐఆర్సీటీసీ మధ్య మంగళవారం అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ నెల 12 నుంచి ఈ సేవలు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. ముందు విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం అవుతాయి.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సీటీసీ యాప్ లో బుక్ చేయాలి. అందులో పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి, మీకు నచ్చిన ఆహారం, కావాల్సిన స్టేషన్ పేరు నమోదు చేస్తే చాలు.. సకాలంలో మీకు ఫుడ్ డెలివరీ అవుతుంది. స్విగ్గీతో భాగస్వామ్యం వల్ల ప్రయాణికులు మరింత మధురానుభూతి పొందుతారని ఐఆర్సీటీసీ ఎండీ సంజయ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ చెప్పారు. మున్ముందు మరో 59 రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ సేవలను స్విగ్గీ అందుబాటులోకి తేనున్నది.