ముంబై: ఇటీవల పలు కంపెనీలు, స్టార్టప్స్ నిధులు సేకరించేందుకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వస్తున్నాయి. నవంబర్ మొదటి పదిహేను రోజుల్లోనే ఐదు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు రూ.27,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) తో పాటు పాలసీ బజార్ మదర్ కంపెనీ పీబీ ఫిన్టెక్, కేఎఫ్కీ-పిజ్జా హట్ నిర్వహణ సంస్థ సాఫైర్ ఫుడ్స్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్, లాటెంట్ వ్యూ అనలటిక్స్ వంటివి ఉన్నాయి.
సెప్టెంబర్-అక్టోబర్లో వచ్చిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ.2778 కోట్ల నిధులు సమీకరించింది. 2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు, ఈ నవంబర్ మిడిల్ నాటికి 46 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి.