న్యూఢిల్లీ : రిటైల్ దిగ్గజం విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా ప్రీమియం స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలక్ట్రానిక్స్పై భారీ డిస్కౌంట్లు, మెగా డీల్స్ను వెల్లడించింది. భారత్లో రిపబ్లిక్ డే సేల్ ఇప్పటికే షురూ కాగా, ఐఫోన్ 14 ఎంఆర్పీ రూ .79,900 కాగా సేల్లో రూ . 74,900కు ఆఫర్ చేస్తుండగా, ఐఫోన్ 13ను బ్యాంక్ ఆఫర్లు కాకుండా రూ . 64,900కు సేల్ చేస్తున్నారు.
ఈ ఆఫర్లకు తోడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ . 4000 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 12 విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్లో భాగంగా డిస్కౌంట్పై రూ . 59,900కు లభిస్తోంది. దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లు, మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, యాపిల్ వాచ్లు, ఎయిర్పాడ్స్ వంటి యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లకు యాపిల్ కేర్ ప్లస్ కింద 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ను విజయ్ సేల్స్ ఆఫర్ చేస్తోంది.
రూ. 23,990 ఎంఆర్పీ కలిగిన శాంసంగ్ గెలాక్సీ ఏ23 సేల్లో రూ . 18,499కి ఆఫర్లో ఉంది. ఇక రూ. 7999 ఎంఆర్పీ కలిగిన ఫైర్బోల్ట్ నింజా కాల్ 2 స్మార్ట్వాచ్ రూ. 1999కే లభిస్తోంది. పలు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కాగా మెగా రిపబ్లిక్ డే సేల్ ఎప్పుడు ముగుస్తుందనేది వెబ్సైట్ వెల్లడించలేదు.