IOC Loss | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) గత ఏప్రిల్-జూన్ మధ్య లీటర్ పెట్రోల్పై రూ.10, లీటర్ డీజిల్పై రూ.14 నష్టపోతున్నాయి. గత రెండేండ్లలో ఇది తొలిసారి అని ఓ అధ్యయనం తెలిపింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.1,992.53 కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు ప్రకటించింది. 2021-22 తొలి త్రైమాసికంలో రూ.5,941.37 కోట్లు, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.6,021.9 కోట్ల నికర లాభం గడించింది ఐఓసీ. గత రెండేండ్లలో ఐఓసీ నష్టాల పాలవ్వడం ఇదే తొలిసారి.
ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం ఈబీఐటీడీఏ 88 శాతం తగ్గి రూ.1,358.9 కోట్లకు చేరుకున్నది. ఫలితంగా నికర నష్టం రూ.1992.5 కోట్లని ఐవోసీ వెల్లడించింది. బ్యారెల్ ముడి చమురు స్థూల రిఫైనరీ మార్జిన్ 31.8 డాలర్లుగా ఉన్నా ఐఓసీ నష్టాలు చవి చూడటం గమనార్హం.
బహిరంగ మార్కెట్లో రోజువారీ ధరలకు అనుగుణంగా కేంద్ర చమురు సంస్థలు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) దేశీయ మార్కెట్లో ధరలు సవరిస్తూ వచ్చాయి. కానీ.. ఇటీవల ఏప్రిల్ ప్రారంభం నుంచి ముడి చమురు ధర పెరిగిపోయినా.. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు యధాతథంగా కొనసాగిస్తూ వచ్చాయి.
బ్యారెల్ క్రూడాయిల్ ధర 109 డాలర్లుగా ఉన్నది. కానీ రిటైల్ పెట్రోల్ పంపుల్లో 85-86 డాలర్లకు సర్దుబాటు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. ఎన్నికల వేళ నిలిపేస్తూ వచ్చాయి. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. మార్చి వరకు పెట్రోల్, డీజిల్ ధరల సవరణ నిలిపేశాయి. ఏప్రిల్లో రూ.10 పెరిగినా.. మళ్లీ సవరించడం నిలిపేశాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో గత మే నెలలో పెట్రోల్, డీజిల్లపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించింది.