శంషాబాద్, నవంబర్ 28: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ డిపార్చర్ కేంద్రంలో కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విమానాశ్రయ విస్తరణలో భాగంగా నాలుగు సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ డిపార్చర్ను వీఐపీ మార్గంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం విస్తరణ పనులు పూర్తికావడంతో తిరిగి ప్రధాన టెర్మినల్లోనే కొత్తగా ఇంటర్నేషనల్ డిపార్చర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ సోమవారం రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. విదేశీ ప్రయాణికులు ప్రధాన టెర్మినల్లోని నూతన డిపార్చర్ కేంద్రాన్ని చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.