Infosys in Vishakha | భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మధురవాడ సెజ్లో కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫోసిస్ సేవలందించనున్నదని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమలశాఖ మంత్రి జీ అమర్నాథ్ చెప్పారు. ప్రస్తుతం సెజ్లో సేవలందిస్తున్నప్పటికీ.. తర్వాత సొంత భవనాన్ని నిర్మించుకుంటుందన్నారు.
ప్రారంభంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ప్రారంభించాలని ఇన్ఫోసిస్ ప్లాన్ చేసింది. ఇప్పటికైతే మరో ఐటీ కంపెనీ ఆవరణలో సేవలు మొదలు పెట్టాలని నిర్ణయించింది. తొలి దశలో వెయ్యి మంది నిపుణులతో సేవలను ప్రారంభించనున్నది.
ఇటీవలే విశాఖ పట్నంలో తమ యూనిట్ ఏర్పాటు చేస్తామని, 2,500-3000 మందితో సేవలందిస్తామని ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, రీజనల్ హెడ్ అమోల్ కులకర్ణి ఇతర అధికారులు చెప్పారు.