Infosys Q2 | డిజిటల్ సర్వీసులకు మంచి గిరాకీతో ఇన్ఫోసిస్ గణనీయ లాభాలు గడించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 11 శాతం నికర లాభాలు పెంచుకున్నది. గతేడాది రూ.5,412 కోట్ల నికర లాభం గడించగా, ఈ ఏడాది రూ.6021 కోట్లకు చేరుకున్నది. ఆపరేషన్ల ద్వారా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 23 శాతం పెంచుకున్నది.
2021-22 రెండో త్రైమాసికంలో రూ.29,602 కోట్ల కన్సాలిడేటెడ్ రెవెన్యూ సంపాదిస్తే, ఈ ఏడాది రూ.36,538 కోట్లకు పెరిగింది. షేర్ ఫ్లోర్ ప్రైస్ రూ.1850 చొప్పున ఇన్ఫోసిస్ రూ.9,300 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. గురువారం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ స్క్రిప్ట్ 0.5 శాతం నష్టపోయి రూ.1,465 వద్ద ముగిసింది. ఈక్విటీ షేర్పై 16.5 శాతం ఇంటరిం డివిడెండ్ ప్రకటించింది.
`క్లయింట్ల బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్లో మా విభిన్నమైన డిజిటల్, క్లౌడ్ సొల్యూషన్స్ కీలక పాత్ర పోషించాయి. రెండో త్రైమాసికంలో నిలకడగా ఆల్రౌండ్ వృద్ధి సాధించాం` అని ఇన్పోసిస్ సీఈవో కం ఎండీ సలీల్ పరేఖ్ చెప్పారు. `డిజిటల్ సేవలకు మంచి గిరాకీతోపాటు మా క్లయింట్ల బిజినెస్ అండ్ సామర్థ్యం పెంచుకోవడంలో వారి విశ్వాసం యధాతథం. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్ 15 నుంచి 16 శాతానికి సవరిస్తున్నాం` అని తెలిపారు.