బెంగళూరు, డిసెంబర్ 15: ఇన్ఫోసిస్ మొదలై 40 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి తన భార్య సుధామూర్తితో కలిసి ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘నా భార్యే.. నా రక్షణ వలయం, నా కల సాకారం కోసం ఆమె నాకెంతో అండగా నిలిచారు’ అన్నారు. సంస్థ ఏర్పాటు, సమస్యలు, పిల్లలు, లక్ష్యాలు.. ఇలా అనేక అంశాలపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మూర్తి: ముందుగా ఇన్ఫోసిస్ ఈ స్థాయికి ఎదిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. కస్టమర్లు, ఉద్యోగులు, మదుపరులు, ప్రభుత్వాలు, సమాజానికి గౌరవం ఇవ్వడం వల్లే ఇన్ఫోసిస్ ఇలా నిలబడగలిగింది.
మూర్తి: నా భార్యే.. నా రక్షణ వలయం. ఆమె వల్లే నా కల సాకరమైంది. నా కంటే కూడా తను ఎంతో ప్రతిభగల వ్యక్తి. ఇక చిన్నప్పట్నుంచి స్వతంత్ర భావాలతో పెరిగాను. ఈ క్రమంలోనే భయం లేకుండా బ్రతకడం నేర్చుకున్నాను.
మూర్తి: నేను ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అందువల్ల కష్టాలు నాకేమీ కొత్త కాదు. జీవితంలో ప్రతీ చిన్న సంఘటన నుంచి కూడా ఓ పాఠాన్ని నేర్చుకునేవాడిని. పెద్దయ్యాక నా సహచర మిత్రులు, నా భార్య సహకారంతో అనుకున్నది సాధించగలిగాను.
మూర్తి: ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటేనే ఓ సాహసం అన్నది నా అభిప్రాయం. అంతేకాదు ఓ త్యాగం. కాబట్టి ఒకటి సాధించాలంటే మరొకదాన్ని కోల్పోక తప్పదు. నా ఆశయ సాధన కోసం పిల్లలు, కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో నా భార్య మద్దతు మరువలేనిది.
సుధామూర్తి: చాలాసార్లు. కానీ ప్రతీసారి పిల్లలకి మీ నాన్న చాలా బిజీ, ఇన్ఫోసిస్ను నిర్మించే పనిలో ఉన్నారు, అందుకు కొంత సమయం పడుతుంది, బాధపడకండి వస్తారు అని చెప్పేదాన్ని. అయితే సమయం దొరికినప్పుడు పూర్తిగా పిల్లలతోనే ఆయన (మూర్తి) గడిపేవారు.
సుధామూర్తి: ఆయనను నేను కలిసినప్పుడు యువకుడు. ఎటువంటి బాధ్యతలు లేవు. అయితే ఆదర్శ భావాలుగలవారు. తక్కువగా మాట్లాడేవారు. ఇప్పుడు అన్ని విషయాల్లో మరింత పరిణతితో కనిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని తప్పకుండా ఆదుకోవాలని చూస్తారు.
2023లో మీ ప్రణాళికలు?
మూర్తి: వచ్చే ఏడాది మా మనుమండ్లు, మనుమరాండ్లతో గడుపుతాం.
సుధామూర్తి: సంస్థ విజయం సాధిస్తుందా?.. లేదా?.. అన్నది నేను ఆలోచించలేదు. నా భర్త తెలివైనవారు, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారు. అందుకే నా దగ్గర ఉన్న రూ.10,000లను ఇన్ఫోసిస్ స్థాపనకు ఇచ్చాను.