బెంగళూరు, డిసెంబర్ 12: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని స్వస్తి పలికేదిశగా అడుగులు వేస్తున్నది. ఇక నుంచి వారానికి మూడు రోజులు కార్యాలయాలకు తప్పనిసరిగా రావాల్సిందేనని ఉద్యోగులకు అల్టిమేటం జారీచేసింది.
కార్యాలయాలకు వచ్చే సిబ్బందిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్న సంస్థ..అలాగే వృద్ధి మందగించడం, పనితీరు మెరుగుపరుచడాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. మరోవైపు, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఇటీవల వ్యాఖ్యానించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మాత్రం ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని, మిగతా వారు వారానికి మూడు రోజులు తప్పకుండా రావాలని ఆదేశించింది.