Infosys | ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాలో సేవలు కొనసాగిస్తున్న ఐటీ జెయింట్ ఇన్ఫోసిస్ ఇబ్బందుల్లో పడింది. బ్రిటిష్ మీడియా సంస్థ స్కై న్యూస్ ఈ విషయమై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ను ప్రశ్నించింది. సునాక్ భార్య, అక్షత మూర్తికి ఇన్ఫోసిస్లో ఒకశాతం లోపు వాటాలు మాత్రమే ఉన్నాయి. ఆమె నారాయణ మూర్తి తనయ కావడంతో రిషి సునాక్ను మీడియా ప్రశ్నించడంతో ఇన్ఫోసిస్ స్పందించింది. రష్యాలోని స్థానిక సంస్థలతో తమకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవని ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
రష్యాలో తమకు చిన్న టీం మాత్రమే పని చేస్తున్నది. అందులో 100 మంది లోపే ఉన్నారు. సేవలన్నీగ్లోబల్ క్లయింట్లకే పరిమితం. రష్యా సంస్థలతో ఎటువంటి వ్యాపార సంబంధాల్లేవని ఇన్పోసిస్ పేర్కొంది. తూర్పు యూరప్ దేశాలకు మాత్రమే తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. బిజినెస్ కమ్యూనిటీ ప్రొటోకాల్స్ మాత్రమే కొనసాగిస్తున్నట్లు వివరించింది.
ఉక్రెయిన్ బాధితులకు 10 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించామని ఇన్ఫోసిస్ తెలిపింది. స్కై న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషి సునాక్.. తాను ఎన్నికైన రాజకీయ వేత్తను, బ్రిటన్ అంశాలకు మాత్రమే బాధ్యత వహిస్తాను. నా భార్య కూడా కాదు అని చెప్పారు.