న్యూఢిల్లీ, జూన్ 20: ఈ సంవత్సరం ద్వితీయార్థంలో భారత్లో ఆహారోత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయని, రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అంచనా వేసింది. చైనాలో కఠిన కొవిడ్ నియంత్రణలు, థాయ్లాండ్లో స్విన్ ఫీవర్, భారత్లో అధిక వేడిమి…ఆసియాలో ఆహారోత్పత్తుల ధరలు మరింత పెరుగుదలకు కారణమవుతాయని నోమురా విడుదల చేసిన ఒక రిపోర్ట్లో తెలిపింది. ఇక్కడ ఏప్రిల్ నెలలో 8.3 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 8 శాతంలోపునకు శాంతించినప్పటికీ, తదుపరి నెలల్లో క్రమేపీ పెరుగుతుందన్నది. గోధుమ ధరలు భారీగా పెరిగినందున ఆయా దేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న నేపథ్యంలో ఇక బియ్యం ధరలు అధికమవుతాయని నోమురా హెచ్చరించింది.