న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశీయ పారిశ్రామిక రంగం ఆశాజనక పనితీరు కనబరిచింది. సెప్టెంబర్ నెలకుగాను పారిశ్రామిక రంగం 3.1 శాతం వృద్ధి నమోదైందని జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్ 2021లో నమోదైన 4.4 శాతంతో పోలిస్తే తగ్గింది.
తయారీ రంగం కేవలం 1.8 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే పారిశ్రామిక ప్రగతిపై ప్రభావం చూపింది. అలాగే గనులు 4.6 శాతం, విద్యుత్ రంగం 11.6 శాతం చొప్పున పెరిగాయి.