Indigo | న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను అందుకున్నది. రూ.3,090.6 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. విమానయాన కార్యకలాపాలు ఆశాజనకంగా సాగడం, మార్కెట్ పరిస్థితులు బాగుండటం కలిసొచ్చిందని సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఈ మూడు నెలల్లో రూ.17, 160.9 కోట్ల ఆదాయాన్ని అందుకున్నట్టు వెల్లడించింది.
ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. దీనికి 316 విమానాలున్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.13, 018.8 కోట్లుగా ఉండగా, రూ.1,064.3 కోట్ల నష్టం చవిచూసింది.