హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-ఢాకాల మధ్య ఇండిగో ఎయిర్లైన్స్ తొలి డైరెక్ట్ సర్వీసు ప్రారంభమైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారానికి రెండు రోజులు నడుస్తుంది. 6ఈ-1963 సోమవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఢాకాకు బయలుదేరగా.. మంగళవారం ఉదయం 6:50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణ సమయం 2:45 గంటలు. శని, సోమవారాల్లో సర్వీసులుంటాయని జీఎమ్మార్ వెల్లడించింది. కాగా, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున మెడికల్ టూరిస్టులు ఫార్మా హబైన హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఈ సర్వీసు వారికి లాభించనున్నది. ఇక హైదరాబాద్ నుంచి థాయ్లాండ్, హాంకాంగ్లకు త్వరలో విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ చెప్పారు.