న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనంపై భారీగానే చూపింది. గత మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వినియోగం 9.1 శాతం పడిపోయింది. 1998-99 తర్వాత ఇలా పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గడం ఇదే తొలిసారి.
రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది మార్చి నెలాఖరు నుంచి దాదాపు రెండు నెలల పాటు పూర్తి లాక్డౌన్.. తర్వాత కొన్ని నెలల పాటు పాక్షిక లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్లో 194.63 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు మాత్రమే వినియోగించారు. 2019-20లో అది 214.12 మిలియన్ టన్నులని శుక్రవారం చమురు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది.
1998-99 తర్వాత ఇంధన వినియోగం భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. డీజిల్ వినియోగం భారీగా 12 శాతం తగ్గిపోయి 72.72 మిలియన్ టన్నులకు పతనం కాగా, పెట్రోల్ వినియోగం 6.7 శాతం తగ్గి 27.95 మిలియన్ టన్నులకు పరిమితమైంది.
కరోనా లాక్డౌన్ వల్ల ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రోడ్డు రవాణా, విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జూన్ నుంచి లాక్డౌన్ను కేంద్రం దశల వారీగా ఎత్తివేసింది.
డీజిల్, పెట్రోల్ వినియోగం భారీగా తగ్గినా.. అదే స్థాయిలో వంట గ్యాస్ వినియోగం పెరిగింది. 2019-20తో పోలిస్తే 2020-21లో వంట గ్యాస్ వినియోగం 4.7 నుంచి 27.59 శాతానికి పెరిగింది. కరోనా నుంచి రిలీఫ్ కోసం కేంద్రం పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసింది.
దాదాపు ఏడాది కాలం మూతపడిన విమాన సర్వీసులు పాక్షికంగా ప్రారంభం అయ్యాయి. ఫలితంగా జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగం 53.6 శాతం తగ్గి 3.7 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్తోనూ పర్సనల్ లోన్.. అయితే!