న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : పేటీఎం బ్రాండ్ను నిర్వహిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్లో మెజారిటీ వాటా భారతీయుల చేతుల్లోనే ఉన్నది. స్టాక్ మార్కెట్లలో నమోదైన ఈ కంపెనీలో దేశీయ మదుపర్ల వాటా ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి 50.3 శాతానికి చేరింది.
ముఖ్యంగా దేశీయ సంస్థాగత మదుపర్ల వాటా 23.1 శాతానికి, భారతీయ మ్యూచువల్ ఫండ్స్ వాటా 16.6 శాతానికి చేరడం గమనార్హం. దీంతో ఈ ఫిన్టెక్ సంస్థపై భారతీయ మదుపర్లలో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది.