Indian orgin Engineer in Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీసంస్థ టెస్లా ఫౌండర్ కం సీఈవో ఎలన్మస్క్ టీంలో తొలిసారి భారత సంతతి ఇంజినీర్కు చోటు దక్కింది. టెస్లా ఆటో పైలట్ టీమ్ సభ్యుడిగా భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామిని నియమించుకున్నట్లు ఎలన్మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. ఆటో పైలట్ ఇంజినీరింగ్ విభాగానికి ఆయన అధిపతిగా ఉంటారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తమ సంస్థలోని కార్లలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్ల కోసం టెస్లా వేచి చూస్తున్నదని ఇంతకుముందు ఎలన్మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తమ ఆటో పైలట్ ఏఐ టీం చాలా ప్రతిభావంతమైందని, ప్రపంచంలోనే అత్యంత నిపుణులని పేర్కొన్నారు. ఇప్పుడు సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగానికి డైరెక్టర్గా అండ్రేజ్ ఉన్నారన్నారు.
ప్రజలు తరుచుగా తనకు, అండ్రేజ్కు ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారని ఎలన్మస్క్ పేర్కొన్నారు. కాగా, అశోక్ ఎల్లుస్వామి టెస్లాలో చేరకముందు ఫోక్స్వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్, వాబ్కో వెహికల్ కంట్రోల్ సిస్టంల్లో పని చేశారు. చెన్నైలోని గౌండీ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. కార్నెజై మెల్లోన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్మెంట్లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు.