న్యూఢిల్లీ, జూలై 28: ఇంధన విక్రయంలో అగ్రగామి సంస్థయైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,750 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత పదేండ్లలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్పై మార్జిన్లు అధికమవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని తెలిపింది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,992.53 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.10,058.69 కోట్ల లాభం కంటే ఇది 37 శాతం అధికం. కంపెనీ చరిత్రలో జనవరి-మార్చి 2013లో రికార్డు స్థాయి 14,513 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.36 శాతం తగ్గి రూ.2.21 లక్షల కోట్లకు తగ్గింది.