Google Chrome | మీరు ఇంటర్నెట్లో పని చేస్తున్నప్పుడు పాపులర్ వెబ్ బ్రౌజర్ ‘గూగుల్ క్రోమ్ (Google Chrome)’ వాడుతున్నారా.. అయితే గూగుల్ క్రోమ్ యూజర్లు అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచించింది. డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్టాప్ల్లో పాత క్రోమ్ బ్రౌజర్లు వినియోగిస్తున్నట్లయితే వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని హితవు చెప్పింది.
క్రోమ్ బ్రౌజర్లో లోపాల వల్ల సైబర్ మోసగాళ్లు రిమోట్ యాక్సెస్ పొంది ‘మీ కంప్యూటర్’ యాక్సెస్ పొందుతారని, అటుపై అందులో గల సున్నితమైన వ్యక్తిగత సమాచారం తస్కరించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) తీవ్రమైన హెచ్చరికలు చేసింది.
గూగుల్ క్రోమ్ విండో వర్షన్ 116.0.5845.110/.111 మ్యాక్, లైనక్స్ వర్షన్ 116.0.5845.110 కంటే ముందు వర్షన్ బ్రౌజర్ల యూజర్లకు ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వర్షన్ బ్రౌజర్లు ఉన్న కంప్యూటర్లలోకి సైబర్ మోసగాళ్లు రిమోట్ యాక్సెస్తో ఎంటరై.. మీ సున్నితమైన డేటా బయటకు లీక్ చేసే ప్రమాదం ఉందని సెర్ట్-ఇన్ తెలిపింది.
మీరు కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ తెలుసుకోవాలంటే.. ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి.. కిందకు వస్తే సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్స్ పేజీలో ఎడమైపు కనిపించే జాబితా చివర్లో ‘అబౌట్ క్రోమ్’ మీద క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ ప్రస్తుత వర్షన్తో అప్ డేట్ అయ్యిందా? లేదా చెబుతుంది. ఒకవేళ అప్ డేట్ చేసుకోకుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అప్ డేట్ అయితే ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అనే సందేశం వస్తుంది.