న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలో 5జీ వినియోగదారులు 2027 ఆఖరుకల్లా 50 కోట్లకు చేరవచ్చని స్వీడన్ టెలికం దిగ్గజం ఎరిక్సన్ అంచనా వేసింది. త్వరలో దేశీయంగా 5జీ టెలికం సేవలు అందుబాటులోకి రాబోతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర కంపెనీలు ఈ ఏడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో 5జీ సేవలను ప్రారంభించాలనీ చూస్తున్నాయి. ఇటీవలే 5జీ వేలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ కూడా వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు విడుదలైంది.
ఎరిక్సన్ రిపోర్టు ముఖ్యాంశాలు
భారత్లో మొత్తం మొబైల్ డాటా ట్రాఫిక్ 2021-2027 మధ్య నాలుగు రెట్లు ఎగిసే వీలున్నది. భారీ ఎత్తున పెరిగే స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఇందుకు కారణం. కస్టమర్లు పెరిగినకొద్దీ వారి సగటు డాటా వినియోగం కూడా ఎక్కువే అవుతుంది.’
-థీ సెంగ్, ఎరిక్సన్ ఇండియా ప్రతినిధి