రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్తోపాటు ఆయన హాజరవుతారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : భారత్-అమెరికా దేశాల మధ్య సబ్-సీ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఏఐ అనుసంధానత పెంచేందుకు సబ్సీ కేబుల్ రూట్లను వేయనున్నట్టు నూఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ఆయన చెప్పారు. ఈ కేబుల్ కనెక్టివిటీని భారత్-అమెరికాతోపాటు దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాలను అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు, కృత్రిమ మేధస్సుపై ఆయన మాట్లాడుతూ.. ఏఐ అనేది అతిపెద్ద మార్పని, వైద్య రంగంలో పరీక్షలు, చికిత్సలు, రైతులు, విద్యార్థులు లేదా ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.