నూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
ఆర్థిక సేవల కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు, సైబర్ సెక్యూరిటీ సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికం, ఎలక్ట్రానిక్స్-ఐటీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.