న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశీయ విమానయాన టికెట్ ధరలు భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఫలితంగా విమానయాన సంస్థలపై పడుతున్న ఈ ఇంధన భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా విమాన టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. దేశీయంగా సరాసరి విమాన టికెట్ ధర 40 శాతానికి పైగా పెంచినట్టు సమాచారం. అంతర్జాతీయ రూట్లో అయితే ఏడాది క్రితం రూ.52 వేలుగా ఉన్న టికెట్ ధర ప్రస్తుతం రూ.75 వేలకు పైగా చేరుకున్నది. అంటే ఇంచుమించు 40 శాతానికి పైగా సవరించాయి. అలాగే గతేడాది రూ.5,850గా ఉన్న సరాసరి దేశీయ విమాన టికెట్ ధర ప్రస్తుతం రూ.8,450కి చేరుకున్నది. సరాసరి దేశీ బుకింగ్ విలువ ఏడాది క్రితం రూ.8,500 నుంచి రూ.9,500 వరకు ఉండగా, ప్రస్తుతం ఇది రూ.9 వేల నుంచి రూ.10 వేలకు చేరుకున్నాయి.
నష్టాలతో నడుస్తున్న విమానయాన సంస్థలకు అండగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. ఇంధన ధరాభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్రం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. ధరలపై ఉన్న నియంత్రణను స్వల్పంగా ఎత్తివేసింది. 60 శాతం ఉచిత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. అలాగే ఏటీఎం సర్చార్జీని విధించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. మొత్తం నిర్వహణలో 60 శాతం ఇంధనం కోసం వెచ్చిస్తున్న సంస్థలకు రూపాయి పతనంDomesticకూడా ఈ నష్టాలను మరింత పెంచింది.Domestic