న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన దూకుడును ప్రదర్శిస్తున్నది. సెప్టెంబర్ నెలలోనూ జియోకు కొత్తగా 34.7 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 44.92 కోట్లకు చేరుకున్నట్టు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తన పోటీ సంస్థయైన ఎయిర్టెల్ను కూడా 13.2 లక్షల మంది కస్టమర్లు ఎంచుకున్నారు. కానీ, వొడాఫోన్ ఐడియా 7.5 లక్షల కస్టమర్లు నష్టపోవడంతో మొత్తం సంఖ్య 22.75 కోట్లకు పరిమితమయ్యారు.