న్యూఢిల్లీ: సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రెట్టింపు టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉంది. 2021 ఆర్థిక చట్టం ప్రకారం గత రెండేండ్లుగా టీడీఎస్ ఫైల్ చేయని వారు, ఒక్కో ఏడాది రూ.50 వేలకు పైగా టీడీఎస్ కోత విధిస్తే.. జూలై ఒకటో తేదీ నుంచి ఐటీఆర్ దాఖలు చేయడానికి భారీగా చెల్లించాల్సి వస్తుంది.
2021 బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఐటీ చట్టంలో నూతనంగా 206 ఏబీ సెక్షన్ను ప్రవేశపెట్టారు. నూతన సెక్షన్ ప్రకారం కొన్ని ఆదాయాల వనరులపై అధిక టీడీఎస్ విధించాలని ప్రతిపాదించారు.
గత రెండేండ్లుగా ఐటీఆర్ ఫైల్ చేయని వారి నుంచి ఒక్కో ఏడాది రూ.50 వేలకు పైగా టీడీఎస్ వసూలు చేయాలని నిర్ణయించారు. సంబంధిత సెక్షన్ లేదా నిబంధనకు అనుగుణంగా టీడీఎస్ రేటుపై రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్కు సీబీడీటీ గడువు పొడిగించింది. టీడీఎస్ దాఖలుకు సాధారణంగా గడువు మే 31తో ముగుస్తుంది. ఈ దఫా దాన్ని జూన్ 30 వరకు పొడిగించింది.
ఐటీ చట్టంలోని నూతన సెక్షన్ 206ఏబీ ప్రకారం రెండేండ్లుగా ఐటీఆర్ దాఖలు చేయని వారి నుంచి అధిక టీడీఎస్ను సంబంధిత సంస్థ యాజమాన్యమే డిడక్ట్ చేసుకుంటుంది.