Stock Market | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఈ ఏడాది జరిగిన భారీ మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్లకు చిన్న షేర్లే గొప్ప రాబడుల్ని పంచాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 22 వరకూ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 45.2 శాతం ర్యాలీ జరపగా, మిడ్క్యాప్ ఇండెక్స్ 41.74 శాతం జంప్చేసింది. ఇదే సమయంలో బీఎస్ఈ ప్రధాన సూచి సెన్సెక్స్ 16.87 శాతం పెరిగింది. సెన్సెక్స్తో పాటే స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్స్లు సైతం చరిత్రాత్మక రికార్డుస్థాయిల్ని చేరాయి.
ర్యాలీలో అధికంగా రిటైల్ ఇన్వెస్టర్లు పాలుపంచుకోవడంతోపాటు దేశ స్థూల ఆర్థిక ఫండమెంటల్స్ పట్ల ఆశాభావం నెలకొనడంతో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు జోరుగా పెరిగాయని విశ్లేషకులు చెప్పారు. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్లోకి భారీగా సిప్ పెట్టుబడులు రావడం కూడా ర్యాలీకి కారణమన్నారు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ బాగుంటే స్మాల్, మిడ్క్యాప్ విభాగాలు ర్యాలీ స్పీడ్గా ఉంటుందని ఏయూఎం క్యాపిటల్ నేషనల్ హెడ్ ముకేశ్ కొచ్చర్ వివరించారు.
ఒక్కో బుల్ ర్యాలీకి నేతృత్వం వహించే రంగాలు మారుతుంటాయని, ఈ దఫా పీఎస్యూలు, రక్షణ, రైల్వేలకు చెందిన షేర్లు గొప్ప రాబడులు ఇచ్చాయని ముకేశ్ కొచ్చర్ తెలిపారు. జీడీపీ వృద్ధి బాగుంటుందన్న అంచనాలు, వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడినందునే చిన్న షేర్ల ర్యాలీ జరుగుతున్నదని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ పాల్కా ఆరోరా చోప్రా చెప్పారు.