న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లలో సహజ వాయువు ధరలు 40 శాతం పెరగడంతో సామాన్యుడిపై మళ్లీ ఇంధన ధరల భారం పడనుంది. విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి, వంట గ్యాస్ వాడకానికి, వాహన ఇంధనంగా సీఎన్జీగా మార్చేందుకు న్యాచురుల్ గ్యాస్ను వాడతారు.
సహజ వాయువు ధరలు పెరగడంతో సీఎన్జీ, పీఎన్జీ ధరలు భారం కానున్నాయి. వీటి ఉత్పాదక వ్యయం పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపనున్నారు. ఇక సీఎన్జీ ధరలు పది శాతం, పీఎన్జీ ధరలు 13 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు.