న్యూఢిల్లీ, జూన్ 29: రూ.20 కంటే తక్కువ ధర కలిగిన సిగరెట్ లైటర్ల దిగుమతులపై గురువారం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘సిగరెట్ లైటర్లకు సంబంధించి ఉన్న దిగుమతి విధానాన్ని సవరించాం. ఈ క్రమంలోనే లైటర్ విలువ రూ.20 కంటే తక్కువగా ఉంటే వాటి దిగుమతులపై నిషేధం వేశాం.
రూ.20, ఆపై ధర ఉన్న సిగరెట్ లైటర్లను దిగుమతి చేసుకోవచ్చు’ అని ఓ నోటిఫికేషన్లో డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. పాకెట్ లైటర్స్, గ్యాస్ ఫ్యూయెల్డ్, నాన్-రిఫిల్లబుల్, రిఫిల్లబుల్ అన్నింటికీ ఈ నిర్ణ యం వర్తిస్తుందని చెప్పింది. 2022-23లో వీటి దిగుమతుల విలువ 0.66 మిలియన్ డాలర్లుగా ఉన్నది. స్పెయి న్, టర్కీ, యూఏఈల నుంచి దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.