Gold-Sliver | బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండితో పాటు విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతం ఉండగా.. దాన్ని 15శాతానికి పెంచింది. పెంచి దిగుమతి సుంకం నిన్నటి నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై గోల్డ్, సిల్వర్ తదితర విలువ లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకం 15శాతం వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఇందులో పదిశాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD), మరో ఐదుశాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (Agriculture Infrastructure Development Cess) ఉంటుంది. తాజాగా సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జి (SWC) నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. కేంద్రం నిర్ణయంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. దేశంలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,050 పలుకుతున్నది.