IIT Bombay Team sucess | భూతాప నివారణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాయి. వాతావరణంలో (అట్మాస్పియర్ – atmosphere) పర్యావరణ కాలుష్యానికి కారణమైన కర్బన ఉద్గారాలను తగ్గించగలిగితేనే భూతాపాన్ని నివారించగలం.. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ తోడైతే సత్ఫలితాలు సాధించ గలం.. అలవోకగా లక్ష్యాన్ని చేరుకోగలం.. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే టీం చేసిన ప్రయత్నం 2.5 లక్షల డాలర్ల (మన కరెన్సీలో రూ.1.85 కోట్లు) బహుమతిని అందుకున్నది. భారత్లో ఈ అవార్డును గెలుచుకున్న తొలి టీం ఇదే కావడం విశేషం.
గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్ ఫౌండేషన్ సహకారంతో ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ ఈ నగదు బహుమతిని ప్రకటించింది. శ్రీనాథ్ అయ్యర్ (పీహెచ్డీ విద్యార్థి), అన్వేష బెనర్జీ (పీహెచ్డీ విద్యార్థి), శృతి భామారె (బీటెక్+ఎంటెక్ విద్యార్థి), శుభం కుమార్ (జూనియర్ రీసెర్చ్ ఫెలో-ఎర్త్ సైన్స్)లతో కూడిన ఐఐటీ బాంబే టీం.. ట్రై-మాడ్యులర్ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఉద్గారాలు వెలువడే కేంద్రాల వద్ద కార్బన్ డయాక్సైడ్ను క్యాప్చర్ చేస్తుందీ ట్రై-మాడ్యులర్ టెక్నాలజీ. వాతావరణం నుంచి ఉద్గారాలను క్యాప్చర్ చేయడంతోపాటు ఆ బొగ్గు పులుసు వాయువును లవణ రూపంలోకి మార్చేస్తుందిది. ఇటీవల గ్లాస్కోలో జరిగిన కాప్-26 సదస్సులో కాప్-26 సదస్సులో సస్టెయినబుల్ ఇన్నోవేషన్ ఫోరం వేదికగా దీన్ని ఆవిష్కరించింది.
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఇన్నోవేటివ్ కాంపిటీషన్ మోడల్స్ను డిజైన్ చేయడంతోపాటు అమలు చేసే సంస్థే ఎక్స్ ప్రైజ్. అట్మాస్పియర్ నుంచి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించేందుకు సస్టెయినబుల్ టెక్నాలజీతో ముందుకు వచ్చిన వారికి ఎక్స్ప్రైజ్తోపాటు ఎలన్మస్క్ ఫౌండేషన్ గత ఏప్రిల్ నెలలో 100మిలియన్ల డాలర్ల (సుమారు రూ.745 కోట్లు) నగదు అవార్డును ప్రకటించాయి. ఇందులో ఐదు మిలియన్ల డాలర్ల (రూ.37 కోట్లు)ను విద్యార్థి అవార్డు ఉంటుంది. ఒక ఏడాదిలో కనీసం 1000 టన్నుల కర్బన ఉద్గారాలను తొలగించగల సామర్థ్యం ఉంటుందని సదరు టెక్నాలజీని అభివృద్ధి చేసిన వారు ప్రదర్శన ద్వారా రుజువు చేయాలి. అంతే కాదు భవిష్యత్లో ఏడాదికి గిగా టన్నుల ఉద్గారాలను తొలగించగల సామర్థ్యం ఉంటుందని రుజువు చేయాలి.
ఈ టీంకు మెంటార్లుగా వ్యవహరించిన ఇద్దరిలో ఐఐటీ బాంబే రసాయన శాస్త్రం & (ఐడీపీసీఎస్) విభాగం ప్రొఫెసర్ అర్నాబ్ దత్తా ఒకరు. ప్రతి రోజూ తమ టీమ్కు దిశానిర్దేశం చేసేవారమని చెప్పారు. అట్మాస్పియర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ను క్యాప్చర్ చేయడంతోపాటు దాన్ని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే రసాయనాలుగా మార్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేశారన్నారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా బ్ధి చేకూరుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bhagyasree Daughter | జూనియర్ భాగ్యశ్రీ ఎంట్రీకి లైన్క్లియర్..!
SBI Alert | ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. అదేమిటంటే?!
5G Auction | ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రం వేలం.. ట్రాయ్లోనూ మార్పులు!
క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్