ముంబై, జనవరి 22: టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్..తాజాగా అయోధ్యలో మరో హోటల్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. 1.3 ఎకరాల స్థలంలో సెలెక్షన్స్ హోటల్ పేరుతో సరికొత్తగా హోటల్ను నిర్మించబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. అయోధ్యలో రామ్ జన్మభూమి మందిర్ ప్రారంభం కావడంతో పర్యాటక ప్రాంతంగా విరజిల్లే అవకాశం ఉన్నదని, దీంతో ఇక్కడ సరికొత్త హోటల్ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే సంస్థ.. వివంత, జింజర్ బ్రాండ్స్ అయోధ్యలో హోటళ్లను ఏర్పా టు చేయబోతున్న విషయం తెలిసిందే.