న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. ప్రీమియం కాంప్యాక్ట్ మాడల్ ఇగ్నిస్ ధరను రూ.27 వేల వరకు పెంచింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. నూతన ఫీచర్ను తయారు చేయడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. నూతన వెర్షన్ను ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రొగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్ ఫీచర్తో తయారు చేయడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని పేర్కొంది.