దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన పాపులర్ మోడల్ బైక్ ‘హీరో కరిజ్మా (Hero Karizma)’ను మంగళవారం మళ్లీ మార్కెట్లో ఆవిష్కరించింది. తొలిసారి 2007 ఆవిష్కరించిన ఈ బైక్ 2014 వరకు పలు అప్డేట్స్తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత హీరో కరిజ్మా (Hero Karizma) మళ్లీ.. కరిజ్మా ఎక్స్ఎంఆర్ (Karizma XMR) ఆవిష్కరించింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ ధర రూ.1.72,900తో ప్రారంభం అవుతుంది. బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. హీరో కరిజ్మా బ్రాండ్ అంబసిడార్గా నియమితులైన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. సరికొత్త కరిజ్మా ఎక్స్ఎంఆర్ అంబసిడార్గా వ్యవహరిస్తారు.
కరిజ్మా ఎక్స్ఎంఆర్ (Karizma XMR) బైక్ 210సీసీ లిక్విడ్ కూల్డ్ డీవోహెచ్సీ వీ4 ఇంజిన్తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 9250 ఆర్పీఎం వద్ద 25.15 హెచ్పీ విద్యుత్, 7250 ఆర్పీఎం వద్ద 20.4 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో వచ్చిన ఈ బైక్ గరిష్టంగా గంటకు 143 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. డ్యుయల్ చానెల్ ఏబీఎస్తోపాటు ఫ్రంట్లో సింగిల్ పెటల్ డిస్క్, స్టాండర్డ్ రేర్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూ టూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవీగేషన్, స్పీడో మీటర్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టచోమీటర్ లతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్టె బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్పోర్ట్స్ బైక్ థీమ్లో భాగంగా యాంటీ గ్లేర్ రేర్ వ్యూ మిర్రర్, హగ్గర్ ఫెండర్, మొబైల్ హోల్డర్, మ్యాగ్నటిక్ టాక్ బ్యాగ్, థై పాడ్స్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు.