న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను మహారాష్ట్ర జీఎస్టీ ఆథార్టీ రూ.270 కోట్ల జీఎస్టీ నోటీసులిచ్చింది.
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీఆర్-1, జీఎస్టీఆర్-9, ఐటీసీ క్లెయింలో అంతరాలు, జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-2ఏ, డిపాజిట్లపై జీఎస్టీ చెల్లింపుల పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించింది. రూ.269.86 కోట్ల నోటీసులో జీఎస్టీ కింద రూ.119.56 కోట్లు కాగా, వడ్డీలు రూ.138.34 కోట్లు, పెనాల్టీ రూపంలో రూ.11.95 కోట్లు విధించింది.