ముంబై, అక్టోబర్ 22: ఐసీఐసీఐ బ్యాంక్ ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.8,006.99 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని అందుకున్నది. నిరుడుతో పోల్చితే 31.43 శాతం పెరిగినట్టు శనివారం బ్యాంక్ తెలియజేసింది. స్టాండలోన్ ఆధారంగా కూడా 37.14 శాతం ఎగిసి రూ.7,557.84 కోట్లకు లాభం చేరింది. పోయినసారి రూ.5,510.95 కోట్లుగానే ఉన్నది. ఇక ఆదాయం రూ.31,088 కోట్లకు ఎగబాకగా, ఖర్చులు సైతం గతంతో పోల్చితే రూ.18,027 కోట్ల నుంచి 19,408 కోట్లకు పెరిగాయి.