IT Len’s | హర్యానాలోని లాప్టాప్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల దిగుమతిదారు, వ్యాపారి ఇండ్లు, దుకాణాలు, ఆఫీసులపై దాడులు చేశామని ఆదాయం పన్ను శాఖ శనివారం తెలిపింది. హర్యానాతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్, హర్యానా, పశ్చిమ బెంగాల్లలో ఈ నెల 10 ఈ దాడులు చేశామని పేర్కొన్నది.
సదరు వ్యాపారి రూ.2000 కోట్ల మేరకు వస్తువుల దిగుమతిపై పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ దాడుల్లో డైరీలు, డిజిటల్ ఆధారాలు, తమ నేరాభియోగాలకు సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారు. ఈ గ్రూప్ భారీస్థాయిలో ఇన్వాయిస్లు లేవని, దిగుమతి చేసుకున్న సరుకులపై తప్పుడు డిక్లరేషన్ సమర్పించినట్లు ఐటీ అధికారుల తనిఖీల్లో తేలింది.
అన్ రికార్డెడ్ లావాదేవీలు, అన్ అకౌంటెడ్ ఇన్వెస్ట్మెంట్లు చేశారని ఐటీ అధికారులు గుర్తించారు. గుల్ల సంస్థల ద్వారా దిగుమతి చేసుకుని పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని దేశమంతా ఎటువంటి క్యాష్ ట్రాన్షాక్షన్లు లేకుండా పంపిణీ చేస్తున్నారని ఐటీ అధికారులు గుర్తించారు.