హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీ హబ్లో నిర్వహించిన మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్లో ఐ-ఎలక్ట్రిక్కు ప్రథమ స్థానం దక్కింది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా మంగళవారం మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ను నిర్వహించారు. దీంట్లో మొత్తం 7 స్టార్టప్లను ఎంపిక చేయగా, అందులో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రానికి చెందినవి నాలుగున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ల నుండి ఒకొక్కటి ఉన్నాయి. ఈ చాలెంజ్లో అభివృద్ధి చెందుతున్న ఈవీ మారెట్ల కోసం స్మార్ట్ చార్జింగ్ సొల్యూషన్లను రూపొందించే ఐ-ఎలక్ట్రిక్కు తొలి స్థానం దక్కగా..ఆ తర్వాతి స్థానంలో నియోమోషన్ నిలిచింది. ఈ స్టార్టప్లకు సంయుక్తంగా రూ.15 లక్షల గ్రాంట్ను అందించనున్నారు.
ఈ సందర్బంగా ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మొబిలిటీ రంగంలో మరిన్ని ఆవిష్కరణలకు ఇలాంటి చాలెంజ్ దోహదం చేస్తుందన్నారు. కొత్తగా, స్థిరమైన మొబిలిటీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాట్లు చేస్తున్నదని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీ హబ్తో కలిసి ఈ చాలెంజ్ను నిర్వహించిందన్నారు.