NSE Co-Location Scam | ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ స్ట్రాటర్జిక్ ఆఫీసర్ కం ఎండీ సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యన్ ఎవరో తనకు తెలియదని ఆ సంస్థ మాజీ సీఈవో కం ఎండీ చిత్ర రామకృష్ణ చెప్పారు. ఆనంద్ సుబ్రమణ్యన్ను, చిత్ర రామకృష్ణను పరస్పరం ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపితే ఆయన్ను గుర్తించడానికి నిరాకరించారు. 22 ఏండ్లుగా తాను యోగిని ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. ఆనంద్ సుబ్రమణ్యన్కు, చిత్ర రామకృష్ణకు మధ్య 2,500 ఈమెయిల్స్ నడిచాయని సోమవారం కోర్టులో సీబీఐ ప్రాసిక్యూటర్ తెలిపారు. వీటిని పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే, ఎన్ఎస్ఈ ఎండీ కం సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనంద్ సుబ్రమణ్యన్ను చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్గా 2013 ఏప్రిల్ ఒటో తేదీన చిత్ర రామకృష్ణ నియమించుకున్నారు. ఆయన వేతనం రూ.1.68 కోట్లు ఖరారు చేశారు. తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్గా, ఎండీ సలహాదారుగా ప్రమోట్ చేశారు. 2016 అక్టోబర్ 15 వరకు పని చేసిన ఆనంద్ సుబ్రమణ్యన్ తీసుకున్న చివరి వేతనం రూ.4.2 కోట్లు.
ఇదిలా ఉంటే, ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాం, అల్టోరిథమ్ స్కామ్ల్లో భాగస్వాములైన ఎన్ఎస్ఈ, సెబీ అధికారులను గుర్తించాల్సి ఉందని సీబీఐ వాదించింది. ఈ కేసులో ప్రధాన నిందితులపై ఇప్పటికీ సీబీఐ చర్యలు తీసుకోలేదని జడ్జి తప్పుబట్టారు.