న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశీయ మార్కెట్లోకి ఇటీవల అందుబాటులోకి వచ్చిన హ్యుందా య్ ఎక్స్టర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకు 50 వేలకుపైగా బుకింగ్లు వచ్చాయి. కేవలం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నెల రోజుల్లోనే 10 వేల నుంచి 50 వేల వరకు బుకింగ్లు వచ్చాయని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. ఈ బుకింగ్లో సన్రూఫ్ కలిగిన మాడల్ను అధికంగా బుకింగ్ చేసుకున్నారని, మొత్తం ఆర్డర్లలో వీటి వాటా 75 శాతంగా ఉన్నదన్నారు. ఆటోమేటిక్ వెర్షన్కు కూడా డిమాండ్ నెలకొన్నది.
ఇటీవలికాలంలో గేర్లు కలిగిన మాడల్ కంటే ఆటోమేటిక్ వెర్షన్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కారు ప్రారంభ ధర రూ.5.99,900గా నిర్ణయించారు. ఈ ధర ఢిల్లీ ఎక్స్షోరూంకు సంబంధించినది. కొత్తగా విడుదలైన ఈ సరికొత్త ఎస్యూవీలో ఆరు ఎయిర్బ్యాగ్లతోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ, నెక్స్ జనరేషన్ ఫీచర్లు, భద్రతకు పెద్దపీట వేసిన సంస్థ.. ఈ మాడల్లో కస్టమర్ల కంఫర్ట్కు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ కారుపై మూడేండ్ల అన్లిమిటెడ్ వ్యారెంటీ ఉన్నది. దీనిని ఏడేండ్లదాకా పెంచుకోవచ్చు.